
సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3, ఓదెల రిపోర్టర్, క్యాతం రమేష్ : పెద్దపెల్లి జిల్లా, ఓదెల మండలంలోని కొమి రే గ్రామంలో బుధవారం డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ నవక్రాంతి ఎఫ్ పి సి ఎల్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఫీల్డ్ ఆఫీసర్ టి. హరీష్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్ రైస్ హాస్పిటల్ వైద్యులచే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ వారికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.