సాక్షి డిజిటల్ న్యూస్ సయ్యద్ సాదిక్ ఖమ్మం టౌన్ రిపోర్టర్ 3 సెప్టెంబర్ ఈరోజు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్ లో ఘనంగా పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సేవలు 108 అయితే ఏమీ మైనార్టీలకి 4% రిజర్వేషన్, రైతులకి ఉచిత కరెంటు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ మరియు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయటం రాజశేఖర్ రెడ్డి ఒక మైలురాయిగా మిగిలిపోయింది. వారు చేసిన సేవలు మరువలేనివి దీంట్లో భాగంగా ముఖ్య అతిథిగా సుడ చైర్మన్ దుర్గాప్రసాద్ గ్రంధాలయ చైర్మన్ ఖాదర్ బాబా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దీపక్ చౌదరి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న కార్యకర్తలు నాయకులు సేవాదళ్ టీం సభ్యులు భారీ సంఖ్యలో చేరుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.